నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని కార్మికులు, భాజపా నేతలు ఆందోళనకు దిగారు. నాగన్పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని అక్రమంగా లే ఆఫ్ ప్రకటించి కార్మికులకు రావాల్సిన 44 నెలల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చి.. కేసీఆర్ మాట మార్చారని భాజపా నాయకులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పించిన సంస్థను అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవీ చూడండి: రేవంత్ రెడ్డి కాస్త వెరైటీ..!