మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. డిచ్పల్లి, నవీపేట్, నిజామాబాద్ పట్టణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా చిరు జల్లులు కురిశాయి.
ఉత్తర, మధ్య మహారాష్ట్ర.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతూ ఉంది. దాని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.
ఇదీ చూడండి: బంజారాహిల్స్లో చీపురు పట్టిన ట్రాఫిక్ పోలీసులు