ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయానికి విద్యుత్ సరఫరా​ నిలిపివేత - telangana varthalu

పెండింగ్​లో ఉన్న విద్యుత్​ బిల్లు చెల్లించలేదని ప్రభుత్వ కార్యాలయానికే విద్యుత్​ సరఫరాను నిలిపివేసిన సంఘటన నిజామాబాద్​ నగరంలో జరిగింది. ఒక నెల విద్యుత్​ బిల్లు మాత్రమే పెండింగ్​లో ఉందని... ఇలా కరెంట్​ కట్​ చేయటం సరైంది కాదని ఎంపీడీవో సంజీవ్​కుమార్​ అన్నారు.

Power outage to government office in nizamabad
ప్రభుత్వ కార్యాలయానికి విద్యుత్ సరఫరా​ నిలిపివేత
author img

By

Published : Jan 5, 2021, 3:31 PM IST

నిజామాబాద్ నగరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించలేదని అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అధికారులు చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఒక నెల మాత్రమే బిల్లు పెండింగ్​లో ఉందని, ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉన్నా ఇంకా రాలేదని ఎంపీడీవో సంజీవ్​కుమార్​ అన్నారు.

కేవలం ఒక నెల విద్యుత్ బకాయి మాత్రమే పెండింగ్​లో ఉందని, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్​ కట్ చేయడం సరైంది కాదని సంజీవ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి విద్యుత్ శాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

నిజామాబాద్ నగరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించలేదని అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అధికారులు చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఒక నెల మాత్రమే బిల్లు పెండింగ్​లో ఉందని, ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉన్నా ఇంకా రాలేదని ఎంపీడీవో సంజీవ్​కుమార్​ అన్నారు.

కేవలం ఒక నెల విద్యుత్ బకాయి మాత్రమే పెండింగ్​లో ఉందని, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్​ కట్ చేయడం సరైంది కాదని సంజీవ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి విద్యుత్ శాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ఎస్సారెస్పీ నీటితో హన్మకొండలోని కాలనీలు జలమయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.