నిజామాబాద్ నగరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించలేదని అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అధికారులు చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఒక నెల మాత్రమే బిల్లు పెండింగ్లో ఉందని, ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉన్నా ఇంకా రాలేదని ఎంపీడీవో సంజీవ్కుమార్ అన్నారు.
కేవలం ఒక నెల విద్యుత్ బకాయి మాత్రమే పెండింగ్లో ఉందని, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేయడం సరైంది కాదని సంజీవ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి విద్యుత్ శాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ఎస్సారెస్పీ నీటితో హన్మకొండలోని కాలనీలు జలమయం!