ETV Bharat / state

కాంగ్రెస్​ నేతల జలదీక్షను భగ్నం చేసిన పోలీసులు - కాంగ్రెస్​ జలదీక్ష

గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ చేపట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు జలదీక్ష నిర్వహించకుండా అరెస్ట్​ చేశారు. జిల్లాలోని ముఖ్య నేతలను గృహ నిర్భంధం చేశారు.

Police Stopped Congress Jala Deeksha In Nizamabad District
కాంగ్రెస్​ జలదీక్ష భగ్నం చేసిన పోలీసులు
author img

By

Published : Jun 13, 2020, 3:29 PM IST

గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిజామాబాద్​ జిల్లాలోని కాంగ్రెస్​ నేతలలో కొంతమందిని గృహ నిర్భంధం చేసి.. మరికొంతమందిని అరెస్టు చేశారు. జిల్లాలోని సారంగపూర్, అలీసాగర్, భూంపల్లి వద్ద కొనసాగుతున్న ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్​ వివిధ ప్యాకేజీల వద్ద ఆందోళనలు చేపట్టేందుకు జిల్లా కాంగ్రెస్​ నాయకులు సిద్ధమయ్యారు. ఆ దీక్షలకు హాజరయ్యేందుకు బయలుదేరనున్న మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలను హైదరాబాద్ పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ముఖ్య నేతలను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్ట్ చేస్తూ జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న వేర్వేరు పోలీస్​ స్టేషన్లకు తరలించారు.

కామారెడ్డిలో భుంపల్లి వద్ద దీక్ష చేసేందుకు వెళ్తున్న జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మదన్ మోహన్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనం ఎక్కేందుకు మదన్​ మోహన్​ నిరాకరించి.. నడుచుకుంటూ వెళ్లారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు నిరసన దీక్షలు చేపడితే అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రాజెక్టు పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిజామాబాద్​ జిల్లాలోని కాంగ్రెస్​ నేతలలో కొంతమందిని గృహ నిర్భంధం చేసి.. మరికొంతమందిని అరెస్టు చేశారు. జిల్లాలోని సారంగపూర్, అలీసాగర్, భూంపల్లి వద్ద కొనసాగుతున్న ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్​ వివిధ ప్యాకేజీల వద్ద ఆందోళనలు చేపట్టేందుకు జిల్లా కాంగ్రెస్​ నాయకులు సిద్ధమయ్యారు. ఆ దీక్షలకు హాజరయ్యేందుకు బయలుదేరనున్న మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలను హైదరాబాద్ పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ముఖ్య నేతలను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్ట్ చేస్తూ జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న వేర్వేరు పోలీస్​ స్టేషన్లకు తరలించారు.

కామారెడ్డిలో భుంపల్లి వద్ద దీక్ష చేసేందుకు వెళ్తున్న జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మదన్ మోహన్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనం ఎక్కేందుకు మదన్​ మోహన్​ నిరాకరించి.. నడుచుకుంటూ వెళ్లారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు నిరసన దీక్షలు చేపడితే అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రాజెక్టు పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: ఈనెల 17న జగన్​, కేసీఆర్​తో ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.