ETV Bharat / state

PM Modi Nizamabad Tour Today : నేడు నిజామాబాద్ జిల్లా​కు ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 6:51 AM IST

Updated : Oct 3, 2023, 7:08 AM IST

PM Modi Nizamabad Tour Today : ప్రధాని నరేంద్రమోదీ నేడు రాష్ట్రానికి రానున్నారు. నిజామాబాద్‌ వేదికగా 8 వేల కోట్లకు పైగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే జిల్లా రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ప్రకటించడంతో.. మోదీకి కృతజ్ఞత సభగా ఇందూరు సభను నిర్వహిస్తున్నారు. ఇందూరు ప్రజాగర్జన పేరుతో నిర్వహించే బహిరంగ సభకు.. ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భారీ జన సమీకరణపై బీజేపీ శ్రేణులు దృష్టి సారించాయి. బహిరంగ సభ కోసం పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

PM Modi Nizamabad Tour Today
PM Modi

PM Modi Nizamabad Tour Today నేడు నిజామాబాద్ జిల్లా​కు ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

PM Modi Nizamabad Tour Today : ప్రధాని మోదీ.. నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board) ప్రకటనతో నిజామాబాద్ బహిరంగ సభను.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞత సభగా విజయవంతం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్‌ రానున్న మోదీ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ఆయా శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పీఎంఓ అధికారులు, ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(Special Protection Force) రంగంలోకి దిగాయి. గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బీజేపీ బహిరంగ సభను తలపెట్టింది.

BJP Nizamabad Public Meeting : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలతో పాటు.. కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు సభకు తరలి రానున్నాయి. మహబూబ్​నగర్ సభలో తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడంతో బీజేపీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. పెద్ద సంఖ్యలో పసుపు రైతులు సభకు తరలి రావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Nizamabad MP Dharmapuri Arvind) ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

PM Modi To Address BJP Nizamabad Public Meeting : నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. రామగుండం ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును.. రాష్ట్ర ప్రజలకు మోదీ అంకితం చేస్తారు. 800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వినియోగించుకోనుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా విద్యుత్‌, ఆరోగ్య, రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.1360 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న 50 పడకల ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులను నిర్మించనునున్నారు. అలాగే రూ.305 కోట్లతో.. 340 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తైన రైల్వే లైన్లను మోదీ ప్రారంభించనున్నారు.

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

BJP Praja Garjana Sabha Arrangements : ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై.. ఇప్పటికే సీఎస్ శాంతికుమారి(CS Shantikumari) అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్య, విద్యుత్, రోడ్లు భవనాలు తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల10 నిమిషాలకు బీదర్ ఎయిర్ పోర్ట్​కు చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్​లో 2 గంటల 55 నిమిషాలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. నిజామాబాద్‌ నూతన కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడి నుంచి ఐదు నిమిషాల వ్యవధిలో సభ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటల 35 నిమిషాల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

ఆ తర్వాత 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4 గంటల 55 నిమిషాలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 5 గంటల 45 నిమిషాలకు బీదర్ ఎయిర్ పోర్ట్‌కు మోదీ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఇప్పటికే మహబూబ్​నగర్ సభలో తెలంగాణ రాష్ట్రానికి.. ప్రధాని భారీ ప్రాజెక్టులు ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్ సభ నుంచి తెలంగాణకు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

PM Modi Meeting Arrangements in Nizamabad : నిజామాబాద్‌లో రేపు ప్రధాని సభ... భారీగా ఏర్పాట్లు

Farmers Celebrations Over Turmeric Board Telangana : దశాబ్దాల కల నెరవేరిన వేళ.. పసుపు బోర్డు ప్రకటనతో రైతుల సంబురాలు

PM Modi Nizamabad Tour Today నేడు నిజామాబాద్ జిల్లా​కు ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

PM Modi Nizamabad Tour Today : ప్రధాని మోదీ.. నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board) ప్రకటనతో నిజామాబాద్ బహిరంగ సభను.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞత సభగా విజయవంతం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్‌ రానున్న మోదీ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ఆయా శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పీఎంఓ అధికారులు, ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(Special Protection Force) రంగంలోకి దిగాయి. గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బీజేపీ బహిరంగ సభను తలపెట్టింది.

BJP Nizamabad Public Meeting : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలతో పాటు.. కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు సభకు తరలి రానున్నాయి. మహబూబ్​నగర్ సభలో తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడంతో బీజేపీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. పెద్ద సంఖ్యలో పసుపు రైతులు సభకు తరలి రావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Nizamabad MP Dharmapuri Arvind) ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

PM Modi To Address BJP Nizamabad Public Meeting : నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8 వేల 21 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. రామగుండం ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును.. రాష్ట్ర ప్రజలకు మోదీ అంకితం చేస్తారు. 800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వినియోగించుకోనుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా విద్యుత్‌, ఆరోగ్య, రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.1360 కోట్లతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న 50 పడకల ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులను నిర్మించనునున్నారు. అలాగే రూ.305 కోట్లతో.. 340 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తైన రైల్వే లైన్లను మోదీ ప్రారంభించనున్నారు.

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

BJP Praja Garjana Sabha Arrangements : ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై.. ఇప్పటికే సీఎస్ శాంతికుమారి(CS Shantikumari) అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్య, విద్యుత్, రోడ్లు భవనాలు తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల10 నిమిషాలకు బీదర్ ఎయిర్ పోర్ట్​కు చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్​లో 2 గంటల 55 నిమిషాలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. నిజామాబాద్‌ నూతన కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడి నుంచి ఐదు నిమిషాల వ్యవధిలో సభ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటల 35 నిమిషాల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

ఆ తర్వాత 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4 గంటల 55 నిమిషాలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 5 గంటల 45 నిమిషాలకు బీదర్ ఎయిర్ పోర్ట్‌కు మోదీ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఇప్పటికే మహబూబ్​నగర్ సభలో తెలంగాణ రాష్ట్రానికి.. ప్రధాని భారీ ప్రాజెక్టులు ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్ సభ నుంచి తెలంగాణకు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.

PM Modi Meeting Arrangements in Nizamabad : నిజామాబాద్‌లో రేపు ప్రధాని సభ... భారీగా ఏర్పాట్లు

Farmers Celebrations Over Turmeric Board Telangana : దశాబ్దాల కల నెరవేరిన వేళ.. పసుపు బోర్డు ప్రకటనతో రైతుల సంబురాలు

Last Updated : Oct 3, 2023, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.