ETV Bharat / state

'అయోధ్యలో భూమిపూజ.. నిజామాబాద్​లో ఎగిరిన కాషాయ జెండా'

author img

By

Published : Aug 5, 2020, 4:40 PM IST

నిజామాబాద్​లోని మార్వాడీ కాలనీలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తన నివాసంలో కాషాయపు జెండాను ఎగురవేశారు. అయోధ్యలో రామమందిర భూమిపూజ సందర్భంగా ఈరోజు యావత్​దేశం గర్వించదగిన దినమని ఆయన పేర్కొన్నారు.

orange flag flying in Nizamabad during Bhoomi Puja in Ayodhya
'అయోధ్యలో భూమిపూజ.. నిజామాబాద్​లో ఎగిరిన కాషాయ జెండా'

నిజామాబాద్ నగరం మార్వాడి గల్లీలోని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా తన నివాసంలో కాాషాయపు జెండా ఎగురవేశారు. యావత్ దేశం గర్వించదగిన దినం ఈరోజని.. రామమందిర భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన తెలిపారు.

ప్రధానిగా మోదీ వచ్చాక దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మోదీ చరిత్రలో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.

నిజామాబాద్ నగరం మార్వాడి గల్లీలోని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా తన నివాసంలో కాాషాయపు జెండా ఎగురవేశారు. యావత్ దేశం గర్వించదగిన దినం ఈరోజని.. రామమందిర భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన తెలిపారు.

ప్రధానిగా మోదీ వచ్చాక దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మోదీ చరిత్రలో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.