ETV Bharat / state

సరైన కారణం లేకపోతే వాహనాలు స్వాధీనం..

author img

By

Published : May 24, 2021, 2:52 PM IST

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్​ కఠినంగా అమలవుతోంది. పట్టణంలోని రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.

nizamabad police vehiclecheckings in lockdown time
సరైన కారణం లేకపోతే వాహనాలు స్వాధీనం..

నిజామాబాద్ జిల్లాలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 తర్వాత ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చినట్లు తేలితే వాహనాలను సీజ్ చేసి వారిని వెనక్కి పంపిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్, పోలీస్ కమిషనరేట్, పులాంగ్, నెహ్రూ చౌక్, వర్ని చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సీజ్ చేసిన వాహనాలను పరేడ్ గ్రౌండ్స్​కు తరలించారు. ఈ వాహనాల కోసం వాహనదారులు చలానాలు చెల్లించి తీసుకునేందుకు వస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.

నిజామాబాద్ జిల్లాలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 తర్వాత ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చినట్లు తేలితే వాహనాలను సీజ్ చేసి వారిని వెనక్కి పంపిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్, పోలీస్ కమిషనరేట్, పులాంగ్, నెహ్రూ చౌక్, వర్ని చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సీజ్ చేసిన వాహనాలను పరేడ్ గ్రౌండ్స్​కు తరలించారు. ఈ వాహనాల కోసం వాహనదారులు చలానాలు చెల్లించి తీసుకునేందుకు వస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.