నిజామాబాద్ నగరంలో మట్టి రోడ్లు కనిపించకుండా సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. రహదారుల పైకి మురుగు నీరు ప్రవహించకుండా.. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని 8 డివిజన్లలో రూ.80 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే గాక.. హరిత నిజామాబాద్ దిశగా.. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని మేయర్ నీతు కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, స్థానిక కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, ఎంఏ ఖుద్దుస్, బబ్లూ ఖాన్, మాయవర్ సవిత, న్యమతబాద్ శివచరణ్, నిచ్చెన్గ్ లత, మాస్టర్ శంకర్, చిటికెల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.