ETV Bharat / state

తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్​ది కీలక పాత్ర: మోహన్​ రెడ్డి

తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీదే కీలక పాత్ర అని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్​లోని కాంగ్రెస్ భవన్​లో ప్రణబ్ ముఖర్జీ సంతాప సభలో పాల్గొన్నారు.

author img

By

Published : Sep 4, 2020, 2:01 PM IST

nizamabad distirct congress president tributes pranab mukharji
తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్​ది కీలక పాత్ర: మోహన్​ రెడ్డి

నిజామాబాద్​లోని కాంగ్రెస్ భవన్​లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీదే కీలక పాత్ర అని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రణబ్ మరణం తీరని లోటని, కాంగ్రెస్ విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

దేశ ప్రథమ పౌరుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా ఏ పదవిలో ఉన్న దేశ అభివృద్ధి కొరకు కృషి చేశారని కొనియాడారు. దేశ ప్రజలు ఆయన సేవలను మరచిపోలేరని, ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొన్నారు.

నిజామాబాద్​లోని కాంగ్రెస్ భవన్​లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీదే కీలక పాత్ర అని నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రణబ్ మరణం తీరని లోటని, కాంగ్రెస్ విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

దేశ ప్రథమ పౌరుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా ఏ పదవిలో ఉన్న దేశ అభివృద్ధి కొరకు కృషి చేశారని కొనియాడారు. దేశ ప్రజలు ఆయన సేవలను మరచిపోలేరని, ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొన్నారు.

ఇవీచూడండి: దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.