ETV Bharat / state

అధికారులతో జిల్లా పాలనాధికారి దృశ్యమాద్యమ సమీక్ష

నిజామాబాద్​ కలెక్టరేట్​లో జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, హరితహారం, తడి పొడి చెత్త సేకరణ, తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల్లో పైప్​లైన్లు, పాత వాటర్​ ట్యాంకులు, సీసీ రోడ్లకు సంబంధించిన మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను జిల్లా పాలనాధికారి ఆదేశించారు.

author img

By

Published : Sep 5, 2020, 12:09 PM IST

nizamabad collector video conference on mission bhagiratha
అధికారులతో జిల్లా పాలనాధికారి దృశ్యమాద్యమ సమీక్ష

మిషన్ భగీరథ, హరితహారం, తడి పొడి చెత్త సేకరణ, తదితర అంశాలపై నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి​ అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులు, ఎంపీవోలు పాల్గొన్నారు. గ్రామాల్లో పైప్​లైన్లు, పాత వాటర్​ ట్యాంకులు, సీసీ రోడ్లకు సంబంధించిన మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను జిల్లా పాలనాధికారి ఆదేశించారు.

నల్లా కనెక్షన్లను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో పైప్​లైన్​ మరమ్మతులు చేసినప్పుడు రోడ్లు చెడిపోతే వెంటనే బాగు చేయించాలన్నారు. ఒక్కసారి గ్రామంలో పనిచేస్తే మళ్లీ వెళ్లకుండా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్​ లత, మిషన్​ భగీరథ ఎస్​ఈ రాజేందర్​కుమార్​, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద నాయక్​, తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ, హరితహారం, తడి పొడి చెత్త సేకరణ, తదితర అంశాలపై నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి​ అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులు, ఎంపీవోలు పాల్గొన్నారు. గ్రామాల్లో పైప్​లైన్లు, పాత వాటర్​ ట్యాంకులు, సీసీ రోడ్లకు సంబంధించిన మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను జిల్లా పాలనాధికారి ఆదేశించారు.

నల్లా కనెక్షన్లను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో పైప్​లైన్​ మరమ్మతులు చేసినప్పుడు రోడ్లు చెడిపోతే వెంటనే బాగు చేయించాలన్నారు. ఒక్కసారి గ్రామంలో పనిచేస్తే మళ్లీ వెళ్లకుండా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్​ లత, మిషన్​ భగీరథ ఎస్​ఈ రాజేందర్​కుమార్​, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద నాయక్​, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.