శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశానికి హాజరు అయ్యే ప్రతి ఒక్కరూ కొవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని సభాపతి పోచారం సూచించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కరోనా టెస్టు చేయించుకున్నారు.
అయితే ఫలితం నెగిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. కరోనా విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్ రెడ్డి సమీక్ష