ETV Bharat / state

సర్కారు బడి.. సమస్యల ఒడి

ఇవి ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని సర్కారు బడులు.. సౌకర్యాల మాటేమో గాని సమస్యలు మాత్రం నిండుగా ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులు మిగతా రోజుల్లో ఎలాగోలా రోజులు గడుపుతున్నా.. వర్షాకాలం మాత్రం నానాకష్టాలు పడుతున్నారు. ఎండకు ఎండి.. వానకు తడిసి శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు.

author img

By

Published : Aug 12, 2019, 10:37 PM IST

సర్కారు బడి.. సమస్యల ఒడి
సర్కారు బడి.. సమస్యల ఒడి

శిథిలావస్థకు చేరిన భవనాలు.. చెరువులను తలపిస్తున్న ఆవరణలు.. ఇదీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్కారు బడుల పరిస్థితి. ఇది ఏ ఒక్క బడిలోనో అనుకుంటే పొరపాటే. దాదాపు ఉమ్మడి జిల్లా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. అసలు బడికి వెళ్లాలంటేనే విద్యార్థులు, పంపించాలంటే వారి తల్లిదండ్రులు భయపడే పరిస్థితులున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే విద్యార్థులకు అవస్థలు మొదలైనట్లే.

నిజామాబాద్ జిల్లాలో 1154 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 75 శాతం పాఠశాలలు మరమ్మతుకు గురయ్యాయి. 492 బడులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1011 పాఠశాలలు ఉండగా.. పెద్ద ఎత్తున మరమ్మతులు చేయాల్సిన గదులు 227 ఉన్నాయి. 346 గదులు పాక్షిక మరమ్మతులు చేయాల్సి ఉంది. సుమారు 423 కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాల ఐదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. గదుల పైకప్పుల రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వానపడితే ఆవరణ చిన్న సైజు చెరువును తలపిస్తుండగా.. తరగతి గదుల్లోకి నీరు చేరుతుంది. డిచ్​పల్లి మండలంలోని పాఠశాలల పరిస్థితి ఇలానే ఉంది. ధర్పల్లి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న మూడు గదులు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల అధికారులు వచ్చి పరిశీలించినా పరిస్థితి మాత్రం మారలేదు.

ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్​నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఐదు గదులూ శిథిలావస్థకు చేరాయి. నందిపేట మండలం తల్వెద ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు కిటికీలు, తలుపులు లేవు. గోడలు బీటల వారాయి. జూన్​ నెలలో విద్యార్థుల తల్లిదండ్రులు అధ్వాన పరిస్థితులపై నిరసన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. మాక్లూర్ మండలం అమ్రాద్ ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు మరమ్మతులకు గురై వాన నీరు తరగతి గదుల్లోకి చేరుతోంది.

ఎడపల్లి మండలంలో మొత్తం 39 బడులుండగా ఉండగా.. అంబం, జైతాపూర్, పోచారం, ఠాణాకలన్, కుర్నాపల్లి పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. రెంజల్ మండలంలోని కల్యాపూర్, బోర్గాం, దూపల్లి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వర్ని మండలం హుమ్నాపూర్, బాల్కొండలోని కిసాన్​నగర్​ పాఠశాలలు విద్యార్థులను అవస్థలకు గురిచేస్తున్నాయి.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న ఏడు గదులూ మరమ్మతులకు చేరుకున్నాయి. అదనపు గదుల నిర్మాణాలు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లు దర్శనమిస్తున్నాయి. భవానిపేట, ఒంటర్ పల్లి, పోల్కంపేట, పర్మల్లలోని సర్కారు బడులు మరమ్మతుకు గురయ్యాయి. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీర్కూర్​ ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మద్నూర్​లోని తెలుగు, మరాఠీ, ఉర్దూ పాఠశాలలో ఉన్న ఐదు గదులూ కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వర్షం పడిన ప్రతిసారి స్కూల్​కు సెలవు ప్రకటించాల్సి వస్తోంది.

అసలే వానాకాలం అందులోనూ సర్కారు బడులు.. విద్యార్థులను అవస్థలకు గురిచేస్తున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న వాటిని కూల్చివేయాలని.. మిగిలిన వాటిని మరమ్మతులు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'వరద ప్రభావం': దర్జాగా ఇల్లెక్కిన మొసలి!

సర్కారు బడి.. సమస్యల ఒడి

శిథిలావస్థకు చేరిన భవనాలు.. చెరువులను తలపిస్తున్న ఆవరణలు.. ఇదీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్కారు బడుల పరిస్థితి. ఇది ఏ ఒక్క బడిలోనో అనుకుంటే పొరపాటే. దాదాపు ఉమ్మడి జిల్లా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. అసలు బడికి వెళ్లాలంటేనే విద్యార్థులు, పంపించాలంటే వారి తల్లిదండ్రులు భయపడే పరిస్థితులున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే విద్యార్థులకు అవస్థలు మొదలైనట్లే.

నిజామాబాద్ జిల్లాలో 1154 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 75 శాతం పాఠశాలలు మరమ్మతుకు గురయ్యాయి. 492 బడులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1011 పాఠశాలలు ఉండగా.. పెద్ద ఎత్తున మరమ్మతులు చేయాల్సిన గదులు 227 ఉన్నాయి. 346 గదులు పాక్షిక మరమ్మతులు చేయాల్సి ఉంది. సుమారు 423 కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాల ఐదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. గదుల పైకప్పుల రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వానపడితే ఆవరణ చిన్న సైజు చెరువును తలపిస్తుండగా.. తరగతి గదుల్లోకి నీరు చేరుతుంది. డిచ్​పల్లి మండలంలోని పాఠశాలల పరిస్థితి ఇలానే ఉంది. ధర్పల్లి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న మూడు గదులు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల అధికారులు వచ్చి పరిశీలించినా పరిస్థితి మాత్రం మారలేదు.

ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్​నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఐదు గదులూ శిథిలావస్థకు చేరాయి. నందిపేట మండలం తల్వెద ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు కిటికీలు, తలుపులు లేవు. గోడలు బీటల వారాయి. జూన్​ నెలలో విద్యార్థుల తల్లిదండ్రులు అధ్వాన పరిస్థితులపై నిరసన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం. మాక్లూర్ మండలం అమ్రాద్ ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు మరమ్మతులకు గురై వాన నీరు తరగతి గదుల్లోకి చేరుతోంది.

ఎడపల్లి మండలంలో మొత్తం 39 బడులుండగా ఉండగా.. అంబం, జైతాపూర్, పోచారం, ఠాణాకలన్, కుర్నాపల్లి పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. రెంజల్ మండలంలోని కల్యాపూర్, బోర్గాం, దూపల్లి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వర్ని మండలం హుమ్నాపూర్, బాల్కొండలోని కిసాన్​నగర్​ పాఠశాలలు విద్యార్థులను అవస్థలకు గురిచేస్తున్నాయి.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న ఏడు గదులూ మరమ్మతులకు చేరుకున్నాయి. అదనపు గదుల నిర్మాణాలు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లు దర్శనమిస్తున్నాయి. భవానిపేట, ఒంటర్ పల్లి, పోల్కంపేట, పర్మల్లలోని సర్కారు బడులు మరమ్మతుకు గురయ్యాయి. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీర్కూర్​ ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మద్నూర్​లోని తెలుగు, మరాఠీ, ఉర్దూ పాఠశాలలో ఉన్న ఐదు గదులూ కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వర్షం పడిన ప్రతిసారి స్కూల్​కు సెలవు ప్రకటించాల్సి వస్తోంది.

అసలే వానాకాలం అందులోనూ సర్కారు బడులు.. విద్యార్థులను అవస్థలకు గురిచేస్తున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న వాటిని కూల్చివేయాలని.. మిగిలిన వాటిని మరమ్మతులు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'వరద ప్రభావం': దర్జాగా ఇల్లెక్కిన మొసలి!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.