నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం స్వల్పబండా తండాలో బానోత్ లత అనే బాలిక కిడ్నాప్కు గురైంది. స్థానికంగా పశువులు మేపుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి బలవంతగా ఎక్కించుకొని అపహరించినట్లు తల్లి చౌలి భాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రధాన కూడళ్ల వద్ద ముమ్ముర తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలిక ఆచూకీ కోసం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇవీచూడండి: మూడు నెలల చిన్నారిని చంపిన మేనమామ