ETV Bharat / state

'మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా వాడాలి'

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ రోగులు చికిత్స పొందేందుకు వీలుగా సదుపాయాలు మెరుగుపరచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

author img

By

Published : Apr 4, 2021, 9:21 AM IST

minister vemula prashanth reddy on covid cases in nizamabad district
'మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి వాడాలి'

నిజామాబాద్​లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కొవిడ్​ ఉద్ధృతిపై నిజామాబాద్​ కలెక్టరేట్​లో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాకేంద్రం, సరిహద్దు ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని... ఈ నేపథ్యంలో అందరూ మాస్క్​లు ధరించాలని సూచించారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యానికి అవసరమైన మందులు, వసతులు సమకూర్చుకోవాలని ఆదేశించారు.

నిజామాబాద్​లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కొవిడ్​ ఉద్ధృతిపై నిజామాబాద్​ కలెక్టరేట్​లో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాకేంద్రం, సరిహద్దు ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని... ఈ నేపథ్యంలో అందరూ మాస్క్​లు ధరించాలని సూచించారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యానికి అవసరమైన మందులు, వసతులు సమకూర్చుకోవాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా కేసుల గుర్తింపునకు కొత్త యూప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.