ETV Bharat / state

స్వచ్ఛ తెలంగాణ కోసం పాటుపడుదాం: మంత్రి వేముల - Minister vemula Prashant Reddy latest news

స్వచ్ఛ తెలంగాణ కోసం పాటుపడుదామని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో తడి, పొడి చెత్తను సేకరించే రెండు వాహనాలను మంత్రి ​ప్రారంభించారు.

Minister vemula prashanth launched two vehicles to collect wet dry garbage in morthad, nizamabad district
స్వచ్ఛ తెలంగాణ కోసం పాటుపడుదాం: మంత్రి వేముల
author img

By

Published : Feb 16, 2021, 2:06 PM IST

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్​ గ్రామపంచాయతీలో తడి పొడి చెత్తను సేకరించే రెండు వాహనాలను మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి అన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఒక్కరూ... తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తే.. చెత్త సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి చెత్త సేకరణ ట్రాక్టర్లు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులమై... స్వచ్ఛ తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సూచించారు.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్​ గ్రామపంచాయతీలో తడి పొడి చెత్తను సేకరించే రెండు వాహనాలను మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి అన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో ప్రతి ఒక్కరూ... తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తే.. చెత్త సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి చెత్త సేకరణ ట్రాక్టర్లు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యులమై... స్వచ్ఛ తెలంగాణను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.