ఆర్మూర్లో మార్కెట్ వ్యాపారుల కష్టాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ప్రతి బుధవారం మార్కెట్ సంత కొనసాగుతోంది. అయితే వర్షకాలంలో టోకు వర్తకులు, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో మొరం పోయడం వల్ల నీరు నిలిచి వ్యాపారులు షామియానాలు వేసుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలు సాగక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టి తమ కష్టాలు తీర్చాలని వ్యాపారులు కోరారు. ఇవీ చూడండి: నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె