యువత విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ రూరల్ ఇంఛార్జ్ భూపతి రెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ భవనంలో నిర్వహించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
ఎన్ఎస్యూఐ 51 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండాను ఆవిష్కరించారు. సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాన్ని పెంపొందించేది ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘమేనన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రమోద్, యూత్ కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షుడు జహెర్ బీన్ హందన్, ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు వేదమిత్ర, భాను పాల్గొన్నారు.