ETV Bharat / state

వెలవెలబోతున్న ఉమ్మడి నిజామాబాద్​​ ప్రాజెక్టులు

author img

By

Published : Aug 12, 2019, 10:26 PM IST

దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రాజెక్టులు నిండిపోయాయి. రాష్ట్రంలోనూ భారీ వరదలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటి  శ్రీరాంసాగర్.. ఉమ్మడి జిల్లాకు ప్రాణాధారమైన నిజాంసాగర్ ప్రాజెక్టులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.

వెలవెలబోతున్న ఉమ్మడి నిజామాబాద్​​ ప్రాజెక్టులు
వెలవెలబోతున్న ఉమ్మడి నిజామాబాద్​​ ప్రాజెక్టులు
ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాల్లో శ్రీరాం సాగర్​, నిజాం సాగర్​ ప్రాజెక్టులు ఉన్నాయి. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్..​ పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. నిజాం సాగర్​ ఉమ్మడి జిల్లాకు సాగు నీరు అందించడంలో కీలకం. అయితే ఈ ఏడాది ప్రాజెక్టుల్లో ప్రవాహం అంతగా లేదు. అంతో ఇంతో శ్రీరాం సాగర్​కు కొన్ని నీళ్లు వచ్చినా.. నిజాం సాగర్​కు మాత్రం రాలేదు. దీంతో నీళ్లు లేక ప్రాజెక్టులు వెలవెలబోతుండగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు. ప్రస్తుతం 16.208 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1062.20 అడుగులుగా ఉంది. ఈ నెల 3 వరకు ప్రాజెక్టులో 5.933 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అదే రోజున 30 వేల క్యూసెక్కుల ప్రవాహం ఎగువ నుంచి రావడం ప్రారంభమైంది. ఆగస్టు 9, 10 తేదీల్లో ఎగువ నుంచి ప్రవాహం పెరిగింది. ఇదే నెల 11న నీటి నిల్వ 15.6 టీఎంసీలకు చేరగా.. వరద తగ్గిపోయి 5 వేల క్యూసెక్కులకు పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవహిస్తుండగా.. శ్రీరాంసాగర్​కు మాత్రం 44 వేల క్యూసెక్కులు దాటలేదు. ఇటీవల పడిన వర్షాల వల్ల కేవలం 10 టీఎంసీల నీరు మాత్రమే చేరింది.

ఇక మంజీరా నదిపై ఉన్న కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్​ ప్రాజెక్టులోకి నీరు రావడం రోజురోజుకీ గగనమవుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినా.. నిజాం సాగర్​కు మాత్రం చుక్క నీరు రాలేదు. నిజాం సాగర్​కు సమీపంలో ఉన్న చిన్న ప్రాజెక్టులు నిండినా లాభం లేకుండా ఉంది. వర్షాలు పడకముందు ఎంత నీరుందో.. ఇప్పుడూ అంతే ఉంది. నిజాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.137 టీఎంసీలు డెడ్ స్టోరేజీతో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1368 అడుగులు ఉంది. ఈనెల 3 నుంచి ఇప్పటి వరకు వరద ప్రవాహం లేదు. ఎగువన మెదక్ జిల్లాలోని సింగూర్ జలాశయం నిండితే తప్ప నిజాంసాగర్​కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టు కింద గత రెండేళ్ల వరకు 2.35లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రాజెక్టులోకి నీళ్లు రాక దాన్ని 1.70 లక్షల ఎకరాలకు కుదించారు.

ఇవీ చూడండి : సాగర్​కు పెరిగిన వరద ఉద్ధృ

వెలవెలబోతున్న ఉమ్మడి నిజామాబాద్​​ ప్రాజెక్టులు
ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాల్లో శ్రీరాం సాగర్​, నిజాం సాగర్​ ప్రాజెక్టులు ఉన్నాయి. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్..​ పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. నిజాం సాగర్​ ఉమ్మడి జిల్లాకు సాగు నీరు అందించడంలో కీలకం. అయితే ఈ ఏడాది ప్రాజెక్టుల్లో ప్రవాహం అంతగా లేదు. అంతో ఇంతో శ్రీరాం సాగర్​కు కొన్ని నీళ్లు వచ్చినా.. నిజాం సాగర్​కు మాత్రం రాలేదు. దీంతో నీళ్లు లేక ప్రాజెక్టులు వెలవెలబోతుండగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు. ప్రస్తుతం 16.208 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1062.20 అడుగులుగా ఉంది. ఈ నెల 3 వరకు ప్రాజెక్టులో 5.933 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అదే రోజున 30 వేల క్యూసెక్కుల ప్రవాహం ఎగువ నుంచి రావడం ప్రారంభమైంది. ఆగస్టు 9, 10 తేదీల్లో ఎగువ నుంచి ప్రవాహం పెరిగింది. ఇదే నెల 11న నీటి నిల్వ 15.6 టీఎంసీలకు చేరగా.. వరద తగ్గిపోయి 5 వేల క్యూసెక్కులకు పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవహిస్తుండగా.. శ్రీరాంసాగర్​కు మాత్రం 44 వేల క్యూసెక్కులు దాటలేదు. ఇటీవల పడిన వర్షాల వల్ల కేవలం 10 టీఎంసీల నీరు మాత్రమే చేరింది.

ఇక మంజీరా నదిపై ఉన్న కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్​ ప్రాజెక్టులోకి నీరు రావడం రోజురోజుకీ గగనమవుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినా.. నిజాం సాగర్​కు మాత్రం చుక్క నీరు రాలేదు. నిజాం సాగర్​కు సమీపంలో ఉన్న చిన్న ప్రాజెక్టులు నిండినా లాభం లేకుండా ఉంది. వర్షాలు పడకముందు ఎంత నీరుందో.. ఇప్పుడూ అంతే ఉంది. నిజాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.137 టీఎంసీలు డెడ్ స్టోరేజీతో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1368 అడుగులు ఉంది. ఈనెల 3 నుంచి ఇప్పటి వరకు వరద ప్రవాహం లేదు. ఎగువన మెదక్ జిల్లాలోని సింగూర్ జలాశయం నిండితే తప్ప నిజాంసాగర్​కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టు కింద గత రెండేళ్ల వరకు 2.35లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రాజెక్టులోకి నీళ్లు రాక దాన్ని 1.70 లక్షల ఎకరాలకు కుదించారు.

ఇవీ చూడండి : సాగర్​కు పెరిగిన వరద ఉద్ధృ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.