ETV Bharat / state

'అధిక ధరలను ఉపసంహరించుకోవాలి' - నిత్యావసర సరకుల ధరలపై సీపీఎం కార్యదర్శి రమేశ్​బాబు ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని నిజామాబాద్​ జిల్లా సీపీఎం జిల్లా నేతలు మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో కోత విధిస్తూ ఆర్డినెన్స్​ను తీసుకురావడంపై సీపీఎం కార్యదర్శి రమేశ్​ బాబు మండిపడ్డారు.

CPM Leaders Protest In Nizamabad
'అధిక ధరలను ఉపసంహరించుకోవాలి'
author img

By

Published : Jun 18, 2020, 7:54 PM IST

లాక్​డౌన్​ వల్ల ఉపాధికోల్పోయిన ప్రజలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెను భారం మోపుతున్నాయని నిజామాబాద్​ జిల్లా సీపీఎం కార్యదర్శి రమేశ్​బాబు అన్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం కరోనా వైరస్​ నిర్మూలన నుంచి రక్షిణ చర్యలు చేపట్టకపోగా.. ప్రజలపై అధిక ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేయడం సరికాదని సీపీఎం కార్యదర్శి రమేశ్​బాబు తెలిపారు.

వేతనాల్లో కోత.. దారుణం

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటం వల్ల గత 12 రోజుల నుంచి పెట్రోల్​పై లీటర్​కు రూ. 6.55 పైసలు డీజిల్ పైన రూ. 7.04 పైసలు భారం పడిందని రమేశ్​బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీని మూలంగా నిత్యావసర సరకుల ధరలు పెరిగి మరింత భారం పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో కోత విధిస్తూ ఆర్డినెన్స్​ను తీసుకురావడంపై రమేశ్​బాబు మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు పెద్ద వెంకట్ రాములు, సూరి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

లాక్​డౌన్​ వల్ల ఉపాధికోల్పోయిన ప్రజలపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెను భారం మోపుతున్నాయని నిజామాబాద్​ జిల్లా సీపీఎం కార్యదర్శి రమేశ్​బాబు అన్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం కరోనా వైరస్​ నిర్మూలన నుంచి రక్షిణ చర్యలు చేపట్టకపోగా.. ప్రజలపై అధిక ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేయడం సరికాదని సీపీఎం కార్యదర్శి రమేశ్​బాబు తెలిపారు.

వేతనాల్లో కోత.. దారుణం

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటం వల్ల గత 12 రోజుల నుంచి పెట్రోల్​పై లీటర్​కు రూ. 6.55 పైసలు డీజిల్ పైన రూ. 7.04 పైసలు భారం పడిందని రమేశ్​బాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీని మూలంగా నిత్యావసర సరకుల ధరలు పెరిగి మరింత భారం పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో కోత విధిస్తూ ఆర్డినెన్స్​ను తీసుకురావడంపై రమేశ్​బాబు మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు పెద్ద వెంకట్ రాములు, సూరి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.