నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో కోళ్లు మృతిచెందడానికి కారణం బర్డ్ఫ్లూ కాదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ తెలిపారు. రాణికేట్, ఫౌల్ఫాక్స్తోనే కోళ్లు మరణించాయని స్పష్టం చేశారు. కోళ్ల రక్తనమూనాలు సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలో బర్డ్ఫ్లూ రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫ్లూను ఎదుర్కొనేందుకు 22 ప్రత్యేక ర్యాపిడ్ బృందాలు ఏర్పాటు చేశామంటున్న పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ భరత్తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..