నిర్మల్ జిల్లా కేంద్రం పాత నటరాజ్మల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఆటో ఢీ కొట్టింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ టీచర్స్ కాలనీకి చెందిన జాదవ్ దాదారావు స్థానికంగా వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. పని ముగించుకొని సైకిల్ పై శివాజీచౌక్ వైపు వస్తుండగా పాత నటరాజ్మల్ సమీపంలోకి రాగానే వెనుకనుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన జాదవ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దేవుడా అమ్మను చంపి నాన్న ఉరేసుకున్నాడు.. మా గతేంటి?