రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలు సీజ్ చేసి వారిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలకు కాపాడడమే తమ కర్తవ్యమని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు ప్రధాన కూడళ్ల వద్ద లాక్డౌన్ అమలును ఆయన పరిశీలించారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానా విధిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1268 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా మాస్కులు ధరించకుండా బయట తిరుగతున్న 961 మందిపై కేసులు నమోదు చేసి రూ.9,61,000 జరిమానా విధించడం జరిగిందని పేర్కొన్నారు. వాటితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎపిడిమిక్ డీసీజస్ ప్రకారం మరో 17 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు.
ఇదీ చూడండి: సేంద్రియ సేద్యంతోనే కల్తీలేని ఆహారం: నిరంజన్రెడ్డి