నిర్మల్ జిల్లాలోని ఈ సేవాకేంద్రాలలో ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈ సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేసారు. కేంద్రంలో ప్రజలకు అందుతున్న ఆధార్, ఇతర సేవలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈసేవా ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సేవలందించాలని నిర్వాహకులతో కలెక్టర్ అన్నారు. కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ నదీంకు సూచించారు.
- ఇదీ చూడండి: 'అసెంబ్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేద్దాం'