ETV Bharat / state

'భూముల క్రమబద్ధీకరణ పకడ్బందీగా చేపట్టాలి' - పంచాయతీ అధికారులతో నిర్మల్ అదనపు కలెక్టర్ సమావేశం

అనధికార లేఅవుట్​లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై నిర్మల్​ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ అధికారులతో అదనపు కలెక్టర్​ హేమంత్ బోర్కడే సమీక్షా సమావేశం నిర్వహించారు.

additional collector meeting on illegal Land regularization
'భూముల క్రమబద్ధీకరణ పకడ్బందీగా చేపట్టాలి'
author img

By

Published : Sep 11, 2020, 7:34 PM IST

నిర్మల్​ జిల్లావ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్​ హేమంత్ బోర్కడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అనధికార లేఅవుట్​లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ పథకం అమలు చేస్తోందన్నారు.

అనధికార లే అవుట్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్​ఆర్​ఎస్ పథకం కింద ప్లాట్లను అక్టోబరు 15 లోగా క్రమబద్ధీకరణ చేసుకునేలా చర్యలు చేపట్టాలని హేమంత్ సూచించారు. ఇప్పటికే గుర్తించిన అక్రమ లే అవుట్​ల భూ యజమానులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.

నిర్మల్​ జిల్లావ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్​ హేమంత్ బోర్కడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అనధికార లేఅవుట్​లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ పథకం అమలు చేస్తోందన్నారు.

అనధికార లే అవుట్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్​ఆర్​ఎస్ పథకం కింద ప్లాట్లను అక్టోబరు 15 లోగా క్రమబద్ధీకరణ చేసుకునేలా చర్యలు చేపట్టాలని హేమంత్ సూచించారు. ఇప్పటికే గుర్తించిన అక్రమ లే అవుట్​ల భూ యజమానులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు.

ఇదీ చూడండి : 'రేపటి నుంచే వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలు నిషేధం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.