ETV Bharat / state

భైంసాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్​

author img

By

Published : Jun 3, 2021, 10:26 AM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు.

Telangana news
నిర్మల్​ వార్తలు

సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని రాహుల్ నగర్​లో పట్టణ ప్రగతిలో భాగంగా కోటి 50 లక్షల నిధులతో నిర్మించిన వైకుంఠదామం ప్రారంభించారు.

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ప్రారంభమైన మొదటి వైకుంఠదామం ఇదేనని మంత్రి అన్నారు. శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భైంసా పట్టణంలో ఎల్​ఈడీ దీపాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భైంసా మున్సిపల్ వైస్ ఛైర్మన్ జాబీర్ హైమద్ పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని రాహుల్ నగర్​లో పట్టణ ప్రగతిలో భాగంగా కోటి 50 లక్షల నిధులతో నిర్మించిన వైకుంఠదామం ప్రారంభించారు.

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ప్రారంభమైన మొదటి వైకుంఠదామం ఇదేనని మంత్రి అన్నారు. శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భైంసా పట్టణంలో ఎల్​ఈడీ దీపాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భైంసా మున్సిపల్ వైస్ ఛైర్మన్ జాబీర్ హైమద్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Vaccine : వ్యాక్సిన్​తోనే రక్ష.. నిరూపించిన నిజామాబాద్ జీజీహెచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.