నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి ప్రజలతో కిటకిటలాడిన దుకాణాలు.. 10 గంటలకు మూతపడ్డాయి. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. ప్రజలు బయటకు రావాలని పోలీసులు సూచించారు. పట్టణంలో రోడ్లపై తిరుగుతున్న వారిని అడ్డుకుని ఇళ్లకు పంపిస్తున్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించి మహమ్మారి బారిన పడకుండా ఉండాలని చెప్పారు.