నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని ఏఎస్పీ దక్షణామూర్తి తెలిపారు.
మరో ఘటనలో నర్సాపూర్ మండల కేంద్రం వద్ద టాటా వాహనం వేగంగా వెళ్లడం గమనించిన పోలీసులు అతన్ని వెంబడించారు. డ్రైవర్ను విచారించగా నిర్మల్లోని ఓ గోదాంలో నిలువ ఉంచిన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5 లక్షలు ఉంటుందని... మొత్తం 12 లక్షల విలువైన గుట్కాను పట్టుకున్నట్లు వెల్లడించారు.