పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు మేనమామ వలే సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 140 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. ప్రపంచానికి బొమ్మల హబ్గా భారత్: మోదీ