నిర్మల్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన శ్రీ దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రులు భక్తులచే విశేష పూజలందుకున్న అమ్మవారికి.. పట్టణవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని ప్రతిష్ఠించి.. మహిళలు మంగళహారతులు, బాజా భజంత్రీల నడుమ ఊరేగింపు నిర్వహించారు. శోభాయాత్ర సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పట్టణంలోని వినాయక్ సాగర్లో అమ్మవారిని నిమజ్జనం చేశారు.
ఇదీ చూడండి.. జమ్మి చెట్టుకు ఎమ్మెల్యే ఆయుధ పూజ