నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి క్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న గురుపౌర్ణమి ఉత్సవాలు నేటితో ముగిశాయి. చివరిరోజు ఉదయం వ్యాస మహర్షి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వ్యాసుడికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అర్చకులు సుహాసిని పూజ మంత్ర పుష్పార్చన చేశారు. అమ్మవారి సన్నిధిలో చండి యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి