ETV Bharat / state

GCC Giri brand soap : గిరిపుత్రులకు అండగా... 'గిరి' సబ్బుల పరిశ్రమ

author img

By

Published : Dec 19, 2021, 12:06 PM IST

GCC Giri brand soap : రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. మొట్టమొదటి సబ్బుల పరిశ్రమ అది. నేడు ఎందరో గిరిపుత్రులకు ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తోంది. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా... సహజ సిద్ధంగా సబ్బులు తయారుచేస్తున్నారు. ప్రభుత్వం గిరి బ్రాండ్ పేరుతో వినియోగదారులకు చేరువయ్యేలా.. చర్యలు తీసుకుంటోంది.

GCC Giri brand soap, tribals employment with soap factory
గిరిపుత్రులకు ఉపాధి చూపుతున్న సబ్బుల పరిశ్రమ
గిరిపుత్రులకు ఉపాధి చూపుతున్న సబ్బుల పరిశ్రమ

GCC Giri brand soap: శరీరానికి పట్టిన మలినాలను తొలగించుకోవాలంటే కావాల్సింది సబ్బు. టీఎఫ్​ఎం శాతం ఎక్కువగా ఉండే వాటికే.. ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. నేడు అలాంటి వాటి కోసం వెతకాల్సిన అవసరం లేకుండా చేసింది.. గిరిజన సహకార సంస్థ. అదెక్కడో కాదు నిర్మల్‌లోని జీసీసీకి చేదోడువాదోడుగా ఉండేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ఏర్పాటు చేసిన సబ్బుల పరిశ్రమ సత్ఫలితాలను ఇస్తోంది. ఆయుష్ డిపార్టుమెంటు ఫార్ములాతో.. గిరిజన సహకార సంస్థచే నడుస్తున్న ఈ పరిశ్రమలో తయారవుతున్న సబ్బులు చాలా నాణ్యత కలిగి ఉంటాయి. తయారీకి ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా సహజ సిద్ధ ఔషధాలను మాత్రమే వాడుతున్నారు. ఈ సబ్బులను వేప, తులసి, కలబంద అనే మూడు రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ఒక్కొక్కటి 150 గ్రాముల పరిమాణంలో ఉంటాయి.

ఆన్​లైన్​లో అటవీ ఉత్పత్తులు

ఆన్‌లైన్‌లో అటవీ ఉత్పత్తులను ఆదివాసీలు అమ్ముతున్నారు. ఈ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే గిరిజన సహకార సంస్థ కార్పొరేట్ వ్యాపార విధానాన్ని అవలంబిస్తూ.. గిరి బ్రాండ్‌కు డిమాండ్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న.. తేనె, శానిటైజర్ లాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది.

ఈ ఫ్యాక్టరీకి రోజూ పది వేల సబ్బులను తయారు చేసే కెపాసిటీ కలిగిఉంది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు, సరిహద్దుల్లోని వారికి కూడా ఇక్కడి నుంచి సబ్బులను పంపడం జరుగుతోంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇక్కడే తయారు చేస్తున్నాం. ఇవి చాలా నాణ్యమైనవి. హెర్బల్ ఇంగ్రిడియెంట్స్ మాత్రమే వాడుతున్నాం. ఇప్పటివరకు మూడు కోట్ల వ్యాపారం చేశాం.

-విజయ కుమార్, జీసీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ మేనేజర్

నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సబ్బుల పరిశ్రమలో.. సుమారు 28 మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు పని లభిస్తోంది. ప్రభుత్వం సబ్బుల పరిశ్రమలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలుంటాయని జీసీసీ ఉద్యోగులు చెబుతున్నారు.

ఇది రాబట్టి సంవత్సరం అవుతుంది. కానీ కరోనా వల్ల అప్పుడు రెండు నెలలే పని చేశాం. అప్పటినుంచి బంద్ ఉంది. ఇప్పుడు మూడు నెలల నుంచి పని మంచిగా జరుగుతోంది. రూ.60 బస్సు ఛార్జీ పోనూ ఓ రూ.300 మిగులుతున్నాయి. బీడీలకంటే ఈ పని బాగానే ఉంది. కానీ ఓ రూ.వంద పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటది. చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు లేవు. అందుకే ఇక్కడ పని చేస్తున్నాం. కానీ శాలరీ పెంచితే బాగుంటుంది.

-జీసీసీ ఉద్యోగులు

ఇదీ చదవండి: Dindi Farmers Compensation Issue : మూడేళ్లు గడిచినా డిండి రైతులకు అందని పరిహారం

గిరిపుత్రులకు ఉపాధి చూపుతున్న సబ్బుల పరిశ్రమ

GCC Giri brand soap: శరీరానికి పట్టిన మలినాలను తొలగించుకోవాలంటే కావాల్సింది సబ్బు. టీఎఫ్​ఎం శాతం ఎక్కువగా ఉండే వాటికే.. ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. నేడు అలాంటి వాటి కోసం వెతకాల్సిన అవసరం లేకుండా చేసింది.. గిరిజన సహకార సంస్థ. అదెక్కడో కాదు నిర్మల్‌లోని జీసీసీకి చేదోడువాదోడుగా ఉండేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా ఏర్పాటు చేసిన సబ్బుల పరిశ్రమ సత్ఫలితాలను ఇస్తోంది. ఆయుష్ డిపార్టుమెంటు ఫార్ములాతో.. గిరిజన సహకార సంస్థచే నడుస్తున్న ఈ పరిశ్రమలో తయారవుతున్న సబ్బులు చాలా నాణ్యత కలిగి ఉంటాయి. తయారీకి ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా సహజ సిద్ధ ఔషధాలను మాత్రమే వాడుతున్నారు. ఈ సబ్బులను వేప, తులసి, కలబంద అనే మూడు రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ఒక్కొక్కటి 150 గ్రాముల పరిమాణంలో ఉంటాయి.

ఆన్​లైన్​లో అటవీ ఉత్పత్తులు

ఆన్‌లైన్‌లో అటవీ ఉత్పత్తులను ఆదివాసీలు అమ్ముతున్నారు. ఈ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే గిరిజన సహకార సంస్థ కార్పొరేట్ వ్యాపార విధానాన్ని అవలంబిస్తూ.. గిరి బ్రాండ్‌కు డిమాండ్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న.. తేనె, శానిటైజర్ లాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది.

ఈ ఫ్యాక్టరీకి రోజూ పది వేల సబ్బులను తయారు చేసే కెపాసిటీ కలిగిఉంది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు, సరిహద్దుల్లోని వారికి కూడా ఇక్కడి నుంచి సబ్బులను పంపడం జరుగుతోంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇక్కడే తయారు చేస్తున్నాం. ఇవి చాలా నాణ్యమైనవి. హెర్బల్ ఇంగ్రిడియెంట్స్ మాత్రమే వాడుతున్నాం. ఇప్పటివరకు మూడు కోట్ల వ్యాపారం చేశాం.

-విజయ కుమార్, జీసీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ మేనేజర్

నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సబ్బుల పరిశ్రమలో.. సుమారు 28 మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు పని లభిస్తోంది. ప్రభుత్వం సబ్బుల పరిశ్రమలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే.. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలుంటాయని జీసీసీ ఉద్యోగులు చెబుతున్నారు.

ఇది రాబట్టి సంవత్సరం అవుతుంది. కానీ కరోనా వల్ల అప్పుడు రెండు నెలలే పని చేశాం. అప్పటినుంచి బంద్ ఉంది. ఇప్పుడు మూడు నెలల నుంచి పని మంచిగా జరుగుతోంది. రూ.60 బస్సు ఛార్జీ పోనూ ఓ రూ.300 మిగులుతున్నాయి. బీడీలకంటే ఈ పని బాగానే ఉంది. కానీ ఓ రూ.వంద పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటది. చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు లేవు. అందుకే ఇక్కడ పని చేస్తున్నాం. కానీ శాలరీ పెంచితే బాగుంటుంది.

-జీసీసీ ఉద్యోగులు

ఇదీ చదవండి: Dindi Farmers Compensation Issue : మూడేళ్లు గడిచినా డిండి రైతులకు అందని పరిహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.