ETV Bharat / state

శాస్త్రోక్తంగా గోమాత అంత్యక్రియలు - nirmal

ఎద్దుల బండిపై మృత కళేబరాన్ని ఊరంతా ఊరేగించారు. సంప్రదాయ బద్దంగా భౌతికకాయానికి స్నానాధి క్రతువులు నిర్వహించి  రుద్రభూమికి తీసుకెళ్లారు. అంతిమ యాత్రకు ఊరంతా తరలివచ్చారు. పండితుడి వేద మంత్రోచ్ఛరణలతో మృత దేహాన్ని ఖననం చేశారు. ఇదంతా సాధారణమే అనుకుంటున్నారా.. ఈ తంతు జరిగింది నిర్మల్​జిల్లా కుబీర్​ ప్రాంత వాసులు దైవంగా భావించే ఓ గోమాతకు.

ఆవు అంత్యక్రియలు
author img

By

Published : Apr 12, 2019, 9:18 PM IST

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో పదేళ్లుగా ఉంటున్న ఓ ఆవును గ్రామస్థులంతా భక్తి శ్రద్ధలతో కొలిచేవారు. అనారోగ్య కారణాలతో ఆ గోవు ఇవాళ మరణించింది. తామంతా భక్తి భావంతో కొలుచుకునే గోవుకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్య క్రతువులు నిర్వర్తించారు ఆ గ్రామస్థులు.

గోవు కళేబరానికి స్నానం చేయించి, కాషాయ వస్త్రం కప్పి ఎడ్లబండిపై మేళతాళాలతో ఊరేగించారు. చిన్నా పెద్దా అంతా గోమాతకి జై అంటూ నినదిస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పండితుడి వేద మంత్రాల నడుమ అంత్యక్రియలు జరిపారు.

గోమాతకు అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు

ఇదీ చదవండి : తొలిసారి గ్రేడింగ్ విధానంలో ఏపీ ఇంటర్ ఫలితాలు

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో పదేళ్లుగా ఉంటున్న ఓ ఆవును గ్రామస్థులంతా భక్తి శ్రద్ధలతో కొలిచేవారు. అనారోగ్య కారణాలతో ఆ గోవు ఇవాళ మరణించింది. తామంతా భక్తి భావంతో కొలుచుకునే గోవుకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్య క్రతువులు నిర్వర్తించారు ఆ గ్రామస్థులు.

గోవు కళేబరానికి స్నానం చేయించి, కాషాయ వస్త్రం కప్పి ఎడ్లబండిపై మేళతాళాలతో ఊరేగించారు. చిన్నా పెద్దా అంతా గోమాతకి జై అంటూ నినదిస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పండితుడి వేద మంత్రాల నడుమ అంత్యక్రియలు జరిపారు.

గోమాతకు అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు

ఇదీ చదవండి : తొలిసారి గ్రేడింగ్ విధానంలో ఏపీ ఇంటర్ ఫలితాలు

Intro:TG_ADB_60D_11_MUDL_STRANG ROOM KU CHERUKUNTUNNA EVM LU_AVB_C12


నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది 230588 మంది ఓటర్లు కు 311 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రొదున్న సమయంలో 2 లేదా 3 దగ్గర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు సాయంత్రం 5 గంటల వరకు 166023 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు, ముధోల్ నియోజకవర్గంలో 31 రూట్ లలో వెళ్లిన అధికారులు తిరిగి స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకుంటున్నారు,EVM, వివి ప్యాడ్ లను స్ట్రాంగ్ రూమ్ వద్ద అధికారులకు అప్పజెపుతున్నారు పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబందిని తిరిగి స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకుంటున్నారు


Body:ముధోల్


Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.