నిర్మల్ జిల్లా ముథోల్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న గ్రామ సర్పంచ్ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గ్రామానికి సుమారు రూ.రెండు కోట్ల నిధులు మంజూరైతే సగానికిపైగా నిధులను సర్పంచ్ తన సొంత అకౌంట్లోకి బదిలీ చేసుకున్నారని ఆరోపించారు.
నిధుల దుర్వినియోగంలో విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్, ముథోల్ ఏఈ, పంచాయతీ శాఖ ఏఈ, జిల్లా పంచాయతీ అధికారి సహకారముందని అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ గ్రామ సర్పంచ్గా వేతనం పొందడమెలా సరైనదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ను వెంటనే తొలగిస్తూ, సహకరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇదీ చూడండి:- ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!