ప్రధాన మంత్రి కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. కరోనా వల్ల నిర్మల్ జిల్లాను అభివృద్ధి చేయలేకపోయామని... జనవరి 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో జిల్లా సమస్యలు లేవనెత్తి అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ను ఇద్దరు తెరాస ఎమ్మెల్యేలు దూషించారని.. అలా దూషించడం సరికాదన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో పాటు వాటిని లేవనెత్తిన వారిని దూషిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భాజపా జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే పనులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయాయని, ప్రధానమంత్రిని కలిసి మరోసారి రైల్వే పనుల గురించి చర్చిస్తామన్నారు.
ఇవీ చదవండి: 'గోవుల అక్రమ రవాణా అడ్డుకోకుంటే.. నేనే రంగంలోకి దిగుతా'