యువత అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా మరికల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.
యువత చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటూ చదువుకోవడానికి త్వరలోనే గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అనంతరం మాద్వార్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే.. గ్రామ శివారు ప్రాంతాల్లో విత్తన బంతులను చల్లారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ సురేఖరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: మానవత్వం చాటుతున్నారు... కరోనా బాధితులకు సహకరిస్తున్నారు