నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలంలోని తిప్రాస్పల్లి దగ్గరలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు. జిల్లాలోని రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని అధికారులను హరిచందన ఆదేశించారు. సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద ఎక్కువగా వాహనాలు బారులు తీరకుండా టోకెన్లు జారీచేసి పత్తి పంట కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, డీఏవో జాన్ సుధాకర్, సీసీఐ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లలో సందిగ్ధం