పట్టణ ప్రగతిలో భాగంగా నారాయణపేట జిల్లాలోని 12, 13వ వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. పట్టణ ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వార్డుల్లోని రోడ్లపై నిర్మించిన పలు అక్రమ నిర్మాణాల పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ నడిచే బాటలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించలేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లను ఆక్రమించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రోడ్లపై నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని కాలనీవాసులకు సూచించారు. వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్