నారాయణపేట జిల్లాలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. 57మందికి రూ.1,00,116 విలువైన చెక్కులను అందించారు. కరోనా విపత్కర సమయంలో కూడా ప్రభుత్వం ఈ చెక్కులను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు.
అత్యవసరంగా బయకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ.. స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్పర్సన్ గంధ అనసూయ తదితరులు పాల్గొన్నారు.