నారాయణపేట మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు అసంపూర్తి సమాచారంతో హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల విలువైన సమయాన్ని వృథా చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని మడ్డిపడ్డారు.
కరోనా వచ్చిన వారిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. మరో సమావేశానికి వచ్చే ప్రతి శాఖ సంబంధించిన అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్రావుకు కరోనా పాజిటివ్