నారాయణ పేట జిల్లా ఊట్కూరు శివారులో జోగినీలకు సంబంధించిన భూమిని జిల్లా కలెక్టర్ హరిచందన పరిశీలించారు. జోగినీలకు సంబంధించిన భూమి చుట్టు కంచె ఏర్పాటు చేయాలని, అందులో వారికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జోగినీలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు పాలనాధికారి చంద్రారెడ్డి పాల్గొన్నారు.