Kavitha on Munugodu: మునుగోడు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాసనే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లా అంటేనే తెరాసకు కంచుకోటని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో తెరాస హేమాహేమీలను ఓడించిందని గుర్తు చేశారు. మునుగోడులో మా ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి అగలేదన్నారు. కరోనాలో సంక్షేమ పథకాలు ఆపలేదని కవిత స్పష్టం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ దోమలగూడలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్లో నిర్వహించిన వేడుకల్లో కవిత పాల్గొన్నారు.
మునుగోడులో ఉపఎన్నిక వస్త ఉన్నది. నల్గొండ జిల్లా తెరాసకు కంచుకోట. ఎందుకంటే గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో మేమే గెలిచాం. హుజూర్నగర్, నాగార్జునసాగర్ సీన్ మునుగోడులో రిపీట్ అవుద్ది. రెండోసారి అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి. భాజపా నాయకులు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి మంచిది కాదు.
- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ