![theft-in-renuka-yellamma-temple-in-chinna-mandharam-village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13741817_385_13741817_1637920796908.png)
అర్ధరాత్రి సమయంలో..
రోజూలాగే నేడు ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు.. హుండీ లేకపోవడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిసరాలు, సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. అర్ధరాత్రి 12 గంటల 32 నిమిషాల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. హుండీలో సుమారు 40 వేల రూపాయల నగదు, 100 నుంచి 200 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
పొదల్లో హుండీ..
హుండీని పగలగొట్టి అందులోని సొమ్మును దుండగులు ఎత్తుకెళ్లారు. హుండీని మాత్రం సమీపంలోని చెట్ల పొదల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డవగా.. అవి ఇప్పుడు వైరల్గా మారాయి.
ఇదీ చూడండి: