ETV Bharat / state

నల్గొండ పట్టణంలో మరో కొవిడ్ పాజిటివ్‌ కేసు - Another corona positive case in Nalgonda

కరోనా కేసుల సంఖ్య.. నల్గొండలో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా పట్టణంలోని ఓకాలనీలో కేసు నమోదైంది. బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలు కన్పించడం వల్ల.. కరోనా పరీక్షలు చేసి పాజిటివ్​గా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు కుటుంబసభ్యులను హోం క్వారంటైన్​ చేశారు.

The number of corona cases in Nalgonda is increasing day by day.
నల్గొండలో మరో పాజిటివ్‌ కేసు
author img

By

Published : Jun 12, 2020, 11:16 AM IST

కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నల్గొండలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. పట్టణంలోని బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. తన తండ్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల 15 రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. 12 రోజుల క్రితం హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు జిల్లా కేంద్రంలోని ఐసీయూ వార్డులో చేర్చారు.

లక్షణాలు: జ్వరం, దగ్గు, ఆయాసం

ఆసుపత్రిలో ఉన్న తండ్రికి సేవలు చేస్తున్న క్రమంలో.. యువకుడికి జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలు కన్పించడం వల్ల స్థానిక వైద్యుల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి పాజిటివ్‌ రావడం వల్ల ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

మరో అయిదుగురికి నిర్ధరణ పరీక్షలు

చికిత్స పొందుతున్న 70 ఏళ్ల వృద్ధుడిని వెంటనే ఐసీయూ వార్డు నుంచి ఐసోలేషన్‌ వార్డుకు మార్చారు. అదే కుటుంబంలో మరో ఐదుగురికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయనున్నట్లు నల్గొండ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు.

మొత్తం కేసులు 18

నల్గొండ జిల్లాలో మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 18కి చేరుకుంది. ఇవే కాకుండా మరో 10 మంది వలస కార్మికులు సైతం వైరస్​ బారిన పడ్డారు. ఈ ఒక్క వారంలోనే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి

కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నల్గొండలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. పట్టణంలోని బీటీఎస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. తన తండ్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల 15 రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. 12 రోజుల క్రితం హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు జిల్లా కేంద్రంలోని ఐసీయూ వార్డులో చేర్చారు.

లక్షణాలు: జ్వరం, దగ్గు, ఆయాసం

ఆసుపత్రిలో ఉన్న తండ్రికి సేవలు చేస్తున్న క్రమంలో.. యువకుడికి జ్వరం, దగ్గు, ఆయాసం లక్షణాలు కన్పించడం వల్ల స్థానిక వైద్యుల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి పాజిటివ్‌ రావడం వల్ల ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

మరో అయిదుగురికి నిర్ధరణ పరీక్షలు

చికిత్స పొందుతున్న 70 ఏళ్ల వృద్ధుడిని వెంటనే ఐసీయూ వార్డు నుంచి ఐసోలేషన్‌ వార్డుకు మార్చారు. అదే కుటుంబంలో మరో ఐదుగురికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయనున్నట్లు నల్గొండ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు.

మొత్తం కేసులు 18

నల్గొండ జిల్లాలో మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 18కి చేరుకుంది. ఇవే కాకుండా మరో 10 మంది వలస కార్మికులు సైతం వైరస్​ బారిన పడ్డారు. ఈ ఒక్క వారంలోనే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.