ETV Bharat / state

ముంచేసిన నల్లచౌట చెరువు.. గూడు కోల్పోయిన ప్రజలు - నల్గొండ జిల్లా తాజా వార్తలు

అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఇటు రైతులకు అటు ప్రజలకు కంటి మీద కునుకు లేకేండా చేస్తున్నాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు పూర్తిగా నిండి.. అలుగు ఉధృతంగా ప్రవహించడం వల్ల.. మండల కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇంట్లోని సామాన్లు, నిత్యావసర సరుకులు నీట మునిగి.. కనీసం పడుకోవడానికి కూడా స్థలం లేకపోవడంతో ప్రజలు కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చారు.

Peoples Problems Due To Heavy rains And Floods In Nalgonda District
ముంచేసిన నల్లచౌట చెరువు.. గూడు కోల్పోయిన ప్రజలు
author img

By

Published : Oct 16, 2020, 12:53 PM IST

Updated : Oct 16, 2020, 1:01 PM IST

నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు నిండి.. మత్తడి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. మండల కేంద్రంలో చెరువు పరిధిలోని పలు కాలనీలు వరద నీటి ఉద్ధృతికి నీట మునిగాయి. దేవరకొండ, మిర్యాలగూడ వెళ్లే దారిలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన మట్టి బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నీరు పెద్దమొత్తంలో ప్రవహించడం వల్ల.. రామాలయం వీధిలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ఇంట్లోని బట్టలు, సామాన్లు, నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ముంచేసిన నల్లచౌట చెరువు.. గూడు కోల్పోయిన ప్రజలు

ఆదుకోండి సారూ..

వరద నీటి ఉద్ధృతికి ఏడు ఇళ్లు పూర్తిగా కూలిపోయి నేలమట్టమయ్యాయి. 20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దసరా సమీపిస్తున్న తరుణంలో బట్టల వ్యాపారులు, చేతివృత్తుల వారు, స్వర్ణకారుల వస్తువులు, సామాన్లు నీటి పాలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీచూడండి: బతుకమ్మ, దసరా ఇళ్ల వద్దనే చేసుకోవాలి: మంత్రి ఈటల

నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు నిండి.. మత్తడి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. మండల కేంద్రంలో చెరువు పరిధిలోని పలు కాలనీలు వరద నీటి ఉద్ధృతికి నీట మునిగాయి. దేవరకొండ, మిర్యాలగూడ వెళ్లే దారిలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన మట్టి బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నీరు పెద్దమొత్తంలో ప్రవహించడం వల్ల.. రామాలయం వీధిలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ఇంట్లోని బట్టలు, సామాన్లు, నిత్యావసర సరుకులు తడిసిపోయాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ముంచేసిన నల్లచౌట చెరువు.. గూడు కోల్పోయిన ప్రజలు

ఆదుకోండి సారూ..

వరద నీటి ఉద్ధృతికి ఏడు ఇళ్లు పూర్తిగా కూలిపోయి నేలమట్టమయ్యాయి. 20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దసరా సమీపిస్తున్న తరుణంలో బట్టల వ్యాపారులు, చేతివృత్తుల వారు, స్వర్ణకారుల వస్తువులు, సామాన్లు నీటి పాలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీచూడండి: బతుకమ్మ, దసరా ఇళ్ల వద్దనే చేసుకోవాలి: మంత్రి ఈటల

Last Updated : Oct 16, 2020, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.