ETV Bharat / state

నీటి పాలైన వరి ధాన్యం.. అన్నదాల దైన్యం

author img

By

Published : Apr 23, 2021, 12:06 PM IST

అకాల వర్షానికి నల్గొండ జిల్లా ఐకేపీ కేంద్రాల్లోని వరి ధాన్యం నీటిపాలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటిలో కొట్టుకుపోవడం వల్ల అన్నదాతలు ఆవేదన చెందారు. కొనుగోళ్లు నిలిపివేయడం వల్లే తమ ధాన్యం తడిసిపోయిందని ఆందోళనకు దిగారు.

sudden rain in nalgonda, paddy grain drenched in nalgonda
నల్గొండలో అకాల వర్షం, నల్గొండలో తడిసిన ధాన్యం

నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిముద్దయింది. పట్టణంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీగా వీచిన ఈదురు గాలులకు వృక్షాలు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల గత రాత్రి కురిసిన వర్షానికి తమ ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

కొనుగోలు కేంద్రాల వద్ద తమను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. ఎలాంటి షరతులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నార్కట్​పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నాస్థలికి చేరుకున్నారు. కలెక్టర్​తో ఫోన్ చేయించి.. అన్నదాతలతో మాట్లాడించారు. కలెక్టర్ హామీతో కర్షకులు ఆందోళన విరమించారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వేములపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. కేంద్రాల్లో ఎక్కువ రోజులు ఉంచకుండా మిల్లులకు ధాన్యాన్ని ఎగుమతి చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిముద్దయింది. పట్టణంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీగా వీచిన ఈదురు గాలులకు వృక్షాలు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల గత రాత్రి కురిసిన వర్షానికి తమ ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

కొనుగోలు కేంద్రాల వద్ద తమను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. ఎలాంటి షరతులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నార్కట్​పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నాస్థలికి చేరుకున్నారు. కలెక్టర్​తో ఫోన్ చేయించి.. అన్నదాతలతో మాట్లాడించారు. కలెక్టర్ హామీతో కర్షకులు ఆందోళన విరమించారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వేములపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. కేంద్రాల్లో ఎక్కువ రోజులు ఉంచకుండా మిల్లులకు ధాన్యాన్ని ఎగుమతి చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.