ETV Bharat / state

రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరందించడమే కేసీఆర్​ లక్ష్యం : ఎమ్మెల్యే

తెలంగాణలో ప్రతి ఎకరానికి నీరందించడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమని నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ అన్నారు. జిల్లాలోని శాలిగౌరారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

author img

By

Published : Jun 15, 2020, 6:20 PM IST

MLA Kishore
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని బీడు భూములన్నీ పంటలతో కళకళలాడుతున్నాయని నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ తెలిపారు. జిల్లాలోని శాలిగౌరారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వానాకాలం పంట సాగు కోసం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు.

మండలంలోని వంగమర్తిలో సంజీవని ట్రస్ట్ చేపట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిశోర్ కుమార్ పాల్గొన్నారు. పేదలకు సరకులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం చేపట్టిన రఫెల్​ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని బీడు భూములన్నీ పంటలతో కళకళలాడుతున్నాయని నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ తెలిపారు. జిల్లాలోని శాలిగౌరారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వానాకాలం పంట సాగు కోసం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు.

మండలంలోని వంగమర్తిలో సంజీవని ట్రస్ట్ చేపట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిశోర్ కుమార్ పాల్గొన్నారు. పేదలకు సరకులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం చేపట్టిన రఫెల్​ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: లక్ష్మణ్‌ అరెస్ట్‌.. ఎంపీ అర్వింద్ గృహనిర్బంధం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.