ETV Bharat / state

అక్కడ రాత్రికిరాత్రే అక్రమ వెంచర్లు వెలిచేస్తున్నాయి!

పురపాలక అధికారులు మున్సిపల్​ ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలవ్వడాన్ని ఆసరాగా చేసుకున్న రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తూ అక్రమాలు చేస్తున్నారు. గ్రేడ్​ వన్​స్థాయి నుంచి గ్రేడ్​ పురపాలక స్థాయికి ఎదుగుతున్న మిర్యాలగూడ పురపాలికలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్ల తీరు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగితాలపై ప్లాట్ల నమూనాలు రూపొందించి విక్రయాలు చేస్తూ పురపాలిక ఆదాయానికి కోట్ల రూపాయల్లో గండి కొడుతున్నారు.

author img

By

Published : Oct 9, 2019, 8:35 AM IST

అడ్డగోలుగా వెంచర్లు... ఆందోళనలో ప్రజలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొందరు రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీ, సమీపంలో చింతపల్లి, గూడూరు, గ్రామ శివారులోని పంటపొలాలు, ఈదులగూడెం ప్రాంతంలోని ఖాళీ స్థలాలు, బంగారుగడ్డ ప్రాంతంలో, అద్దంకి-నార్కెట్​పల్లి ప్రధాన రహదారి వెంట, నందిపాడు శివారులో ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్నెస్పీ పిల్లకాలువ వెళ్తుండగా దాన్ని బండ రాళ్లతో పూడ్చి వేసి చదును చేశారు. అనుమతి వచ్చేంత వరకు పనులు చేసేందుకు అవకాశం లేకపోయినప్పటికీ అధికారుల కళ్లుగప్పి పనులు కానిస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ భూమిలోకి సైతం హద్దులు ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రమాదం జరిగితే... భారీ నష్టం

మరోవైపు నల్గొండ వై జంక్షన్ సమీపంలో నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నా... కనీస అనుమతులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నా భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిర్మాణాల విషయంలో పురపాలక అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కిందస్థాయిలో పర్యవేక్షణ లోపంతో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి.

మార్కెటింగ్ చిట్కా...

రెవెన్యూ శాఖ నుంచి పంటపొలాలకు నాలా మార్పిడి మాత్రం చేయించి పురపాలికలో లే అవుట్ ఫీజు పేరుతో రూ. 10వేలు డీడీ మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ కాగితాలను చూపించి కొనుగోలు దారులను అనుమతి ఉన్న లేఅవుట్ల పేరుతో నమ్మిస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. ఎవరైనా పురపాలిక కిందిస్థాయి అధికారులు తనిఖీలకు వస్తే వారికి డీడీలు చూపిస్తూ మేనేజ్ చేస్తున్నారు.

నామరూపాల్లేకుండా...

ఎన్​ఎస్పీ పిల్ల కాలువలను సైతం ఆనవాళ్లు లేకుండా చేస్తుండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్ల కాలువలను పూర్తిగా పూడ్చి వేస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ప్రత్యేక అధికారి పురపాలక ఉన్నత అధికారులు దృష్టిసారించి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

ఒకే ఒక్క దరఖాస్తు

అద్దంకి రహదారి వెంబడి హైదరాబాద్ రోడ్డు వైపున ఉన్న ఒక వెంచర్ వారు మాత్రమే డీటీసీపీ అనుమతికి దరఖాస్తు చేశారని పట్టణ ప్రణాళిక అధికారి రమేశ్​ తెలిపారు. ఇప్పటివరకు పట్టణంలోని ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు తమ వద్దకు రాలేదని స్పష్టం చేశారు. అనుమతిలేని లేఅవుట్​లో ప్లాట్లు ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని, తర్వాత అక్రమ లేఅవుట్ల ఫీజు చెల్లింపు కొనుగోలుదారులపై పడుతుందని సూచించారు.

ఇదీ చూడండి : ప్లాస్టిక్ డబ్బాతో.. శునకానికి తంటాలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొందరు రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీ, సమీపంలో చింతపల్లి, గూడూరు, గ్రామ శివారులోని పంటపొలాలు, ఈదులగూడెం ప్రాంతంలోని ఖాళీ స్థలాలు, బంగారుగడ్డ ప్రాంతంలో, అద్దంకి-నార్కెట్​పల్లి ప్రధాన రహదారి వెంట, నందిపాడు శివారులో ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్నెస్పీ పిల్లకాలువ వెళ్తుండగా దాన్ని బండ రాళ్లతో పూడ్చి వేసి చదును చేశారు. అనుమతి వచ్చేంత వరకు పనులు చేసేందుకు అవకాశం లేకపోయినప్పటికీ అధికారుల కళ్లుగప్పి పనులు కానిస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ భూమిలోకి సైతం హద్దులు ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రమాదం జరిగితే... భారీ నష్టం

మరోవైపు నల్గొండ వై జంక్షన్ సమీపంలో నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నా... కనీస అనుమతులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నా భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిర్మాణాల విషయంలో పురపాలక అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కిందస్థాయిలో పర్యవేక్షణ లోపంతో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి.

మార్కెటింగ్ చిట్కా...

రెవెన్యూ శాఖ నుంచి పంటపొలాలకు నాలా మార్పిడి మాత్రం చేయించి పురపాలికలో లే అవుట్ ఫీజు పేరుతో రూ. 10వేలు డీడీ మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ కాగితాలను చూపించి కొనుగోలు దారులను అనుమతి ఉన్న లేఅవుట్ల పేరుతో నమ్మిస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. ఎవరైనా పురపాలిక కిందిస్థాయి అధికారులు తనిఖీలకు వస్తే వారికి డీడీలు చూపిస్తూ మేనేజ్ చేస్తున్నారు.

నామరూపాల్లేకుండా...

ఎన్​ఎస్పీ పిల్ల కాలువలను సైతం ఆనవాళ్లు లేకుండా చేస్తుండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్ల కాలువలను పూర్తిగా పూడ్చి వేస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ప్రత్యేక అధికారి పురపాలక ఉన్నత అధికారులు దృష్టిసారించి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

ఒకే ఒక్క దరఖాస్తు

అద్దంకి రహదారి వెంబడి హైదరాబాద్ రోడ్డు వైపున ఉన్న ఒక వెంచర్ వారు మాత్రమే డీటీసీపీ అనుమతికి దరఖాస్తు చేశారని పట్టణ ప్రణాళిక అధికారి రమేశ్​ తెలిపారు. ఇప్పటివరకు పట్టణంలోని ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు తమ వద్దకు రాలేదని స్పష్టం చేశారు. అనుమతిలేని లేఅవుట్​లో ప్లాట్లు ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని, తర్వాత అక్రమ లేఅవుట్ల ఫీజు చెల్లింపు కొనుగోలుదారులపై పడుతుందని సూచించారు.

ఇదీ చూడండి : ప్లాస్టిక్ డబ్బాతో.. శునకానికి తంటాలు

Intro:TG_NLG_81_04_vencharlalo_akramalu_investigation_PKG_TS10063

contributor: K.Gokari
center : Nalgonda(miryalaguda)
()

కొత్త పురపాలిక చట్టం వస్తుందని పాత పురపాలిక చట్టాలు ఇక అమలు కావని పురపాలిక లో ఒకవైపు ప్రత్యేక అధికారి పరిపాలన మరోవైపు పురపాలిక అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలై ఉండగా దీన్ని ఆసరాగా చేసుకుని రియల్ వ్యాపారులు అనుమతులు తమకు ఉన్నాయి అంటూ అక్రమాలకు తెరతీశారు. ఇది ఎక్కడో కొత్తగా ఏర్పాటు అయిన పురపాలిక అనుకుంటే పొరపాటే గ్రేడ్ వన్ స్థాయి నుంచి గ్రేడ్ పురపాలక స్థాయికి ఎదుగుతున్న మిర్యాలగూడ పురపాలిక లో అక్రమంగా ఏర్పాట్లు చేస్తున్న వెంచర్ల తీరు ఇది పంటపొలాలను చదును చేయడం లే అవుట్ లు ఏర్పాటు చేయటం కాగితాలపై ప్లాట్ల నమూనాలను రూపొందించి విక్రయాలు చేస్తూ పురపాలిక ఆదాయానికి కోట్ల రూపాయలలో గండి కొడుతూ కోట్లాది రూపాయలు లాభాలు సాధిస్తున్న తీరు ఇది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, సమీపంలో చింతపల్లి, గూడూరు, గ్రామ శివారులోని పంటపొలాలు ఈదులగూడెం ప్రాంతంలోని ఖాళీ స్థలాలు బంగారుగడ్డ ప్రాంతంలో అద్దంకి-నార్కెట్పల్లి ప్రధాన రహదారి వెంబడి నందిపాడు గ్రామ శివారులో ప్రాంతంలో ఈ తరహా అక్రమ వ్యాపారం ఊపు అందుకుంది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వెంబడి కొందరు వ్యాపారులు వెంచర్ ఏర్పాటు చేయగా కేవలం డీడీ 10 వేలు మాత్రమే చెల్లించి పనులు చేపడుతున్నారు ఇందులో ఎన్ఎస్పీ పిల్లకాలువ వెళ్తుండగా దాన్ని బండ రాలతో పూడ్చి వేసి చదును చేశారు అనుమతి వచ్చేంత వరకు పనులు చేసేందుకు అవకాశం లేకపోయినప్పటికీ అధికారుల కన్నుగప్పి పనులు కానిచ్చేస్తున్నారు. ఇదే లే అవుట్ లో సమీపంలోని ప్రభుత్వ భూమిలోకి సైతం హద్దులు ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

మరోవైపు పట్టణంలో నల్గొండ వై జంక్షన్ సమీపంలో నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్న గా కనీసం అనుమతులు తీసుకోలేదు భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి ప్రమాద ఘటన చోటు చేసుకున్న భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇందిరమ్మ కాలనీ కి వెళ్లే ప్రధాన రహదారి వెంట ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తుండగా కనీసం అనుమతులు తీసుకోలేదు ఫంక్షన్ హాల్ ల ఏర్పాటులో పురపాలక ఉన్నత అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కింద స్థాయిలో పర్యవేక్షణ లోపంతో యదేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.

నాగార్జునసాగర్ ప్రధాన రహదారి వెంట కొందరు వ్యాపారులు అనుమతిలేకుండా లేఅవుట్లు చేస్తూ అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ ప్రచారం సాగిస్తూ విక్రయాలు చేపడుతున్నారు ప్రధానంగా మిర్యాలగూడ త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర మండల పరిధిలో ఈ తరహా దందా సాగుతోంది.

వ్యాపారుల మార్కెటింగ్ చిట్కా.............. రెవెన్యూ శాఖ నుంచి పంటపొలాలను నాలా మార్పిడి మాత్రం చేయించి పురపాలిక లో లే అవుట్ ఫీజు పేరుతో రూ. 10వేలు డిడి మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ కాగితాలను చూపించి కొనుగోలు దారులను అనుమతి ఉన్న లేఅవుట్ల పేరుతో నమ్మిస్తూ అమ్మకాలు చేపడుతున్నార. ఎవరైనా పురపాలిక కిందిస్థాయి అధికారులు తనిఖీలకు వస్తే వారికి డీడీలు లు చూపిస్తూ మెసేజ్ చేస్తూ తమ వ్యాపారాలు సాగిస్తున్నారు.

ఎంఎస్పి పిల్ల కాలువలను సైతం ఆనవాలు లేకుండా పూర్తి వేస్తుండగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఎన్నెస్పీ మేనేజర్ కాలువలు మైనర్లకు మాత్రమే రికార్డులు హద్దులు ఉండగా పిల్ల కాలువలకు కు ఎలాంటి రికార్డులు లేవు దీన్ని ఆసరాగా చేసుకుని పిల్ల కాలువలను పూర్తిగా పొడిచి వేస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ప్రత్యేక అధికారి పురపాలక ఉన్నత అధికారులు దృష్టిసారించి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

dtcp అనుమతి ఒక్కరే దరఖాస్తు చేశారు: పట్టణ ప్రణాళిక అధికారి రమేష్ మాట్లాడుతూ............( అధికారి అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది గమనించగలరు) అద్దంకి రహదారి వెంబడి హైదరాబాద్ రోడ్డు వైపున ఉన్న ఒక వెంచర్ వారు మాత్రమే dtcp అనుమతి కి దరఖాస్తు చేశారు. పట్టణంలో ఇప్పటివరకు ఏ ప్రాంతం నుంచి dtcp దరఖాస్తు మా వద్దకు రాలేదు. మేము కింది స్థాయిలో రెవెన్యూ శాఖల నుంచి నిరభ్యంతర ధ్రువ పత్రాలు ఉంటేనే dtcp కి పంపుతాం ఇందిరమ్మ కాలనీ వెంబడి ఏర్పాటు చేస్తున్న వారికి క్లియరెన్స్ ఉంటేనే దరఖాస్తు తీసుకుంటాం ప్రజల లో చైతన్యమై అనుమతిలేని లేఅవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు తర్వాత అక్రమ లేఅవుట్లు ఫీజు చెల్లించే కొనుగోలుదారుల పై పడుతుంది.


బైట్స్............

1) పరంగి రాము.

2) బంటు వెంకటేశ్వర్లు.


Body:నల్గొండ జిల్లా


Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.