ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన సురభి రవీందర్(25), పాశం తరుణ్రెడ్డి గల్లంతయ్యారు. ఏడుగురు మిత్రులతో కలిసి వీరు హైదరాబాద్ నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అక్కడ జరిగిన లాంచి ప్రమాదంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియక.. బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా వీరిద్దరి ఆచూకీ అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండిః "మృతదేహాలు స్వస్థలాలకు చేరేవిధంగా చర్యలు"