ETV Bharat / state

సాధారణ ప్రసవం.. తల్లీ పిల్లలకు శ్రేయస్కరం

ప్రతి మహిళకు పిల్లల్ని కనడం జీవితంలో ఒక మధుర ఘట్టం. నవ మాసాలు శిశువును తన గర్భంలో మోసి, ప్రసవం తర్వాత పాపను చూసుకుని మురిసిపోవడం, ఆ బోసినవ్వు చూసి తల్లి ప్రసవ వేదనను మరిచిపోవడం సాధారణం. శిశువు, తల్లి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే సాధారణ ప్రసవాలతోనే సాధ్యమని వైద్యులు చెబుతున్నారు.

author img

By

Published : Dec 15, 2019, 7:34 PM IST

awareness on normal deliveries for pregnant ladies in nalgonda district hospital
నల్గొండ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలపై అవగాహన
నల్గొండ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలపై అవగాహన

పూర్వం గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా సాధారణ ప్రసవాలే జరిగేవి. ఉమ్మడి కుటుంబంలో పెద్దలు.. స్త్రీ గర్భం దాల్చిన మొదలు ప్రసవమయ్యే వరకు తీసుకోవాల్సిన ఆహారం, ఇతర జాగ్రత్తలు చెప్పి వారిని మానసికంగా, శారీరకంగా సుఖ ప్రసవాల కోసం సిద్ధం చేసేవారు.

అప్పుడు 80.. ఇప్పుడు 10

మంత్రసానుల కాలంలో 70 నుంచి 80 శాతం సాధారణ ప్రసవాలు జరిగితే... అన్ని రకాల వైద్య సేవలు, గొప్పగొప్ప వైద్య నిపుణులు అందుబాటులో ఉన్న నేటితరంలో 10 శాతం కూడా సాధారణ ప్రసవాలు జరకపోవడం గమనార్హం.

సుఖ ప్రసవంపై అవగాహన

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా నల్గొండ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నారు. వైద్యపరీక్షల కోసం వచ్చే గర్భిణీలకు ఉచిత వాహనం సౌకర్యం, నగదు ప్రోత్సాహం, కేసీఆర్ కిట్లతో పాటు ప్రసూతి వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తలతో సుఖప్రసవాల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.

సత్ఫలితం

జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాలపై వైద్యులు చేస్తున్న కృషి మంచి సత్ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది జనవరిలో శస్త్ర చికిత్సల ప్రసవాల సంఖ్య 70 శాతం ఉన్నప్పటికీ అక్టోబర్ నాటికి 40 శాతానికి తగ్గడమే ఇందుకు నిదర్శనం.

లాభ నష్టాలు వివరిస్తున్నారు

ఆసుపత్రికి వస్తున్న గర్భిణీలకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభం నుంచి కౌన్సెలింగ్ ఇవ్వడం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. గర్భిణీలకు ప్రసూతి సంరక్షణ, ఐరన్ పొలిక్ యాసిడ్ మందుల ఉపయోగం, ఆహారం, విశ్రాంతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ ప్రసవాలతో తల్లిబిడ్డకు కలిగే ప్రయోజనాలు, శస్త్ర చికిత్స వల్ల జరిగే నష్టాలు వివరిస్తున్నారు.

24 గంటలు అందుబాటులో

తల్లి పాల ప్రాముఖ్యత, కుటుంబ నియంత్రణ, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న మహిళకు సర్కార్​ అందించే ప్రోత్సాహం, కేసీఆర్ కిట్టు ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండటం ద్వారా శస్త్ర చికిత్స ప్రసవాలు తగ్గి సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి.

వైద్యుల కృషి

వైద్యరంగంలో మనకంటే ఎంతో ముందున్న యూరోపియన్ దేశంలోనూ నేటికి 80 శాతం సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి. మన దేశంలోనూ సుఖప్రసవాల శాతం పెంచేందుకు నల్గొండ జిల్లా మాతాశిసు సంరక్షణ కేంద్ర వైద్యులు కృషి చేస్తున్నారు.

నల్గొండ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలపై అవగాహన

పూర్వం గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా సాధారణ ప్రసవాలే జరిగేవి. ఉమ్మడి కుటుంబంలో పెద్దలు.. స్త్రీ గర్భం దాల్చిన మొదలు ప్రసవమయ్యే వరకు తీసుకోవాల్సిన ఆహారం, ఇతర జాగ్రత్తలు చెప్పి వారిని మానసికంగా, శారీరకంగా సుఖ ప్రసవాల కోసం సిద్ధం చేసేవారు.

అప్పుడు 80.. ఇప్పుడు 10

మంత్రసానుల కాలంలో 70 నుంచి 80 శాతం సాధారణ ప్రసవాలు జరిగితే... అన్ని రకాల వైద్య సేవలు, గొప్పగొప్ప వైద్య నిపుణులు అందుబాటులో ఉన్న నేటితరంలో 10 శాతం కూడా సాధారణ ప్రసవాలు జరకపోవడం గమనార్హం.

సుఖ ప్రసవంపై అవగాహన

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా నల్గొండ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నారు. వైద్యపరీక్షల కోసం వచ్చే గర్భిణీలకు ఉచిత వాహనం సౌకర్యం, నగదు ప్రోత్సాహం, కేసీఆర్ కిట్లతో పాటు ప్రసూతి వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తలతో సుఖప్రసవాల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.

సత్ఫలితం

జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాలపై వైద్యులు చేస్తున్న కృషి మంచి సత్ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది జనవరిలో శస్త్ర చికిత్సల ప్రసవాల సంఖ్య 70 శాతం ఉన్నప్పటికీ అక్టోబర్ నాటికి 40 శాతానికి తగ్గడమే ఇందుకు నిదర్శనం.

లాభ నష్టాలు వివరిస్తున్నారు

ఆసుపత్రికి వస్తున్న గర్భిణీలకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభం నుంచి కౌన్సెలింగ్ ఇవ్వడం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. గర్భిణీలకు ప్రసూతి సంరక్షణ, ఐరన్ పొలిక్ యాసిడ్ మందుల ఉపయోగం, ఆహారం, విశ్రాంతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ ప్రసవాలతో తల్లిబిడ్డకు కలిగే ప్రయోజనాలు, శస్త్ర చికిత్స వల్ల జరిగే నష్టాలు వివరిస్తున్నారు.

24 గంటలు అందుబాటులో

తల్లి పాల ప్రాముఖ్యత, కుటుంబ నియంత్రణ, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న మహిళకు సర్కార్​ అందించే ప్రోత్సాహం, కేసీఆర్ కిట్టు ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండటం ద్వారా శస్త్ర చికిత్స ప్రసవాలు తగ్గి సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి.

వైద్యుల కృషి

వైద్యరంగంలో మనకంటే ఎంతో ముందున్న యూరోపియన్ దేశంలోనూ నేటికి 80 శాతం సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి. మన దేశంలోనూ సుఖప్రసవాల శాతం పెంచేందుకు నల్గొండ జిల్లా మాతాశిసు సంరక్షణ కేంద్ర వైద్యులు కృషి చేస్తున్నారు.

Intro:నల్గొండ...
ప్రతి మహిళకు పిల్లల్ని కనడం జీవితంలో ఒక మధుర ఘట్టం.....పట్టణాలు, గ్రామాల్లో పూర్వం ఎక్కువగా సాధారణ
ప్రసవాలే జరిగేవి.ప్రతి గర్భిణి కి తనపై తనకు నమ్మకం ఉండేది. ఉమ్మడి కుటుంబంలో పెద్దలు స్త్రీ గర్భం దాల్చిన మొదలు పసవమయ్యే వరకువతీసుకోవాల్సిన ఆహారం, ఇతర జాగ్రత్తలు చెప్పి వారిని మానసికంగా,శారీరకంగా సుఖ ప్రసవాల కోసం సిద్ధం చేసేవారు. తద్వారా గతంలో 90 శాతం సాధారణ ప్రసవాలే జరిగేవి. వైద్యరంగంలో మనకంటే ఎంతో ముందున్న యూరోపియన్ దేశంలోనూ నేటికి 80 శాతం సాదారణ ప్రసవాలే జరుగుతున్నాయి. మంత్రసానులు ప్రసవాలు చేసిన పూర్వకాలంలో 70 నుంచి 80 శాతం సాధారణ జరిగితే... నేడు అన్నిరకాల వైద్యసేవలు,వైద్యులు
అందుబాటులో ఉన్నా కొద్ది రోజుల క్రితం వరకు 90 శాతం శస్త్ర చికిత్స ప్రసవాలే జరగడం గమనార్హం. అయితే ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ని మాతశిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణులకు అధికారులు సిబ్బంది ఇస్తున్న కౌన్సెలింగ్ మంచి ఫలితాలని ఇస్తోంది. వైద్యపరీక్షలు నిమిత్తం వచ్చే గర్భిణీలకు ఉచిత వాహనం సౌకర్యం, నగదు ప్రోత్సాహం, కేసీఆర్ కిట్లతో పాటు ప్రసూతి వైద్యులు తీసుకుంటున్న జాగ్రత్తలతో సుఖప్రసవాల సంఖ్య క్రమేణా పెరుగుతుంది.

మార్పునకు ముమ్మరయత్నాలు......

కొద్ది రోజులుగా జిల్లా కేంద్రంలోని మాటశిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాలపై వైద్యులు చేస్తున్న కృషి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో శస్త్ర చికిత్సల ప్రసవాల సంఖ్య 70 శాతం ఉన్నపటికీ అక్టోబర్ కు వచ్చే సరికి 40 శాతానికి తగ్గడమే ఇందుకు నిదర్శనం. ఆసుపత్రికి వస్తున్న గర్భిణులకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభం నుంచి కౌన్సెలింగ్ ఇవ్వడం , హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సూచనలు,సలహాలు ఎప్పటికప్పుడు అందించడం 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండటం ద్వారా శస్త్ర చికిత్సల ప్రసవాలు తగ్గి సుఖ ప్రసవాలు పెరుగుతున్నాయి.

కౌన్సెలింగ్ ఇలా ఇస్తున్నారు....

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచటానికి ఆసుపత్రి కి వచ్చిన గర్భిణులకు వైద్యులు, సిబ్బంది ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నారు.ఇందులో ప్రసూతి సంరక్షణ,ఐరన్ పొలిక్ యాసిడ్ మందులు ఉపయోగం, ఆహారం , విశ్రాంతి, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 9 నెలలు నిండటంతో
తల్లిబిడ్డకు కలిగే ప్రయోజనాలు, శస్త్ర చికిత్స వల్ల జరిగే నష్టాలు వివరిస్తున్నారు. దింతో పాటు తల్లి పాల ప్రాముఖ్యత, కుటుంబ నియంత్రణ, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న మహిళకు ప్రభుత్వం అందించే ప్రోత్సహం, కేసీఆర్ కిట్టు ఇతర విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.


గమనిక:-విజువల్స్ FTP ద్వారా పంపడం జరిగింది. చూసి వాడుకోగలరు.




Body:బైట్స్....
1.సునీత (రామన్నగూడెం) నల్గొండ జిల్లా
2.పద్మ (కొండ మల్లెపల్లి) "
3.సునిత(ఉట్లపల్లి) "
4.విజయ రాణి(ట్రైనర్) "
5.డాక్టర్ ఎం.నర్సింహా(సూపరింటెండెంట్ జనరల్ ఆసుపత్రి) నల్గొండ.
6.ఇందిర (ప్రసూతి డాక్టర్)



Conclusion:9502994640
మధు
నల్గొండ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.