మున్సిపాలిటీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగానే... నల్గొండ జిల్లా చండూర్లో నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చండూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వేల 55 మంది ఓటర్లు ఉన్నందున 10 వార్డులుగా విభజించామని... మొత్తం నలుగురు ఆర్వోలను నియమించామని తెలిపారు. 10 వార్డులకుగాను 20 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రత్యేకాధికారి శ్రీనివాస మూర్తి తెలిపారు.
ఇవీ చూడండి: సజ్జనార్పై వివాదాస్పద వ్యాఖ్యలు ట్వీట్ చేసిన ఎంపీ అసదుద్దీన్